పున్నమి: అక్టోబర్ 19 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం: ఓ అర్అర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పస్నూర్ గ్రామానికి చెందిన చితలూరి గణేష్ (23) నాలుగు నెలలుగా ఎల్బీ నగర్లోని దుర్గా ఫైర్ వర్క్స్ షాపులో కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం గణేష్ సహా ఇతర కార్మికులు డీసీఎం వాహనంలో బాణసంచా లోడుతో ఘట్కేసర్ వైపు వెళ్ళారు. అక్కడ బాణసం చా దించుకున్న అనంతరం, మరొక గోదాం ఉన్న మహేశ్వరం వైపు బయలుదేరారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున వారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం 10 వద్దకు చేరుకు న్నారు. అదే సమయంలో లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక లైట్లు లేకుండా రహదా రిపై వాహనాన్ని నిలిపి ఉంచాడు. డీసీఎం డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఆ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డీసీ ఎం క్యాబిన్లో కూర్చున్న గణేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న సతీష్, సందీప్ లకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోలీసు లు ఉస్మానియా మార్చురీకి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన డీసీఎం ఒకరి మృతి.. మరో ఇద్దరికి గాయాలు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 వద్ద ఘటన
పున్నమి: అక్టోబర్ 19 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం: ఓ అర్అర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పస్నూర్ గ్రామానికి చెందిన చితలూరి గణేష్ (23) నాలుగు నెలలుగా ఎల్బీ నగర్లోని దుర్గా ఫైర్ వర్క్స్ షాపులో కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం గణేష్ సహా ఇతర కార్మికులు డీసీఎం వాహనంలో బాణసంచా లోడుతో ఘట్కేసర్ వైపు వెళ్ళారు. అక్కడ బాణసం చా దించుకున్న అనంతరం, మరొక గోదాం ఉన్న మహేశ్వరం వైపు బయలుదేరారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున వారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం 10 వద్దకు చేరుకు న్నారు. అదే సమయంలో లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక లైట్లు లేకుండా రహదా రిపై వాహనాన్ని నిలిపి ఉంచాడు. డీసీఎం డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఆ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డీసీ ఎం క్యాబిన్లో కూర్చున్న గణేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న సతీష్, సందీప్ లకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోలీసు లు ఉస్మానియా మార్చురీకి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

