_ వెల్దండ తహసిల్దార్ కార్తీక్ కుమార్.
అక్టోబర్11,పున్నమి న్యూస్:
ప్రజలందరూ తమకు కావాల్సిన సమాచారాన్ని పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్దండ తహసిల్దార్ కార్తీక్ కుమార్ అన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా సమావేశం నిర్వహించారు. సందర్భంగా తహసిల్దార్ కార్తీక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్టోబర్ 5 నుండి 1 2 వరకు ఆర్ టి ఐ వారోత్సవాలు నిర్వహిస్తుందని తాసిల్దార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం 2005 సంవత్సరం లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పౌరుడు నేరుగా ప్రతి కార్యాలయంలో సమాచారం ద్వారా ప్రతి సమాచారాన్ని కోరెందుకు అవకాశం ఉందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి రుసుము లేకుండా తీసుకునేలా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కాపీలను సైతం ప్రజలు పొందేందుకు ఈ చట్టం ద్వారా అమలవుతుందన్నారు.
చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వివినియోగం చేసుకోవాలి సూచించారు. ప్రజలకు కావలసిన సమాచారం తీసుకేనేవిదంగా దరఖాస్తులు చేసుకోవాలే తప్ప ప్రశ్నలు స్పందించే విధంగా ఉండొద్దన్నారు. సమాచారకు చట్టం ద్వారా ఇచ్చిన సమాచారం కు ఫిర్యాదుదారుడు తృప్తి చెందనిచో ప్రథమ అప్పీలేటు అధికారి ఆర్ డి ఓ , ఆర్ టి ఐ కమిషన్ కు దరఖాస్తు చేసి పూర్తి సమాచారం పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కిరణ్ కుమార్, కార్యాలయ సిబ్బంది సిద్దయ్య, గణేష్, శోభ, గ్రామస్తులు ఉన్నారు.


