రాజ్ భవన్లో గవర్నర్ ని కలిసిన టీఎజేఎ-ఎన్ యు జే (ఐ) ప్రతినిదులు
హైదరాబాద్, సెప్టెంబర్ 20:-
హైదరాబాద్లోని రాజ్ భవన్లో శనివారం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఎ), నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా(ఎన్యూజే (ఐ) ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్ ను వారు శాలువాతో సత్కరించారు. జర్నలిస్టుల సమస్యలపై గవర్నర్తో కాసేపు చర్చించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు. గనర్నర్ ను కలిసిన వారిలో ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా మాజీ సభ్యులు, ఎన్ యు జే (ఐ )మాజీ చైర్మెన్, టీ జే ఎ, జాప్ అడ్వయిజరి కమిటీ చైర్మెన్ ఉప్పల లక్ష్మణ్, ఎన్ యుజే(ఐ)ఉపాధ్యక్షులు, టీ జే ఎ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కార్ రాజేందర్ నాథ్, టిజేఎ అధ్యక్షులు కదిరి వెంకట రమణ రావు, ప్రధానకార్యదర్శి ఎం.ఆర్ గౌరీ వున్నారు.


