Saturday, 16 May 2026
  • Home  
  • మాయమాటలు చెప్పి గొలుసు దొంగతనం
- నిర్మల్

మాయమాటలు చెప్పి గొలుసు దొంగతనం

నిర్మల్ జిల్లా: ( పున్నమి ప్రతినిధి):- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాస్తవపూర్ గ్రామానికి చెందిన యమున పశువులను మేపేందుకై అబ్దుల్లాపూర్ గ్రామ శివారు ప్రాంతంలోకి వెళ్ళింది. పశువులు మేపుతున్న సమయంలో అటుగా వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకి మాయ మాటలు చెప్పి మెడలో ఉన్న రెండు తులాల గొలుసును లాక్కొని తను వచ్చిన అదే ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. జరిగిన విషయాన్ని యమునా లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిసి ఫుటేజ్ ల ఆధారంగా ముధోల్ మండలం ఆష్ట కాలనీకి చెందిన పిప్పర విజయ్ అని తెలియడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిజమే అని తెలిసింది. దీంతో శనివారం గొలుసు దొంగతనం చేసిన పిప్పర విజయ్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు అవినాష్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. జల్సాల కోసం ఇలా దొంగతనాలు అలవాటు చేసుకోవడం మంచిది కాదని ఎలాంటి తప్పిదాలు చేసిన నిఘానేత్రం తప్పకుండా గుర్తిస్తుందని అన్యాయం జరిగిన ప్రజలకు న్యాయం చేయకురేలా ఎంతటి వారైనా ఉపేక్షించకుండా పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. ప్రజలు ఇలాంటి దొంగల బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిదని తెలిపారు. మీడియా సమావేశంలో సిఐ మల్లేష్ లోకేశ్వరం ఎస్సై అశోక్ లు ఉన్నారు.

నిర్మల్ జిల్లా: ( పున్నమి ప్రతినిధి):- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాస్తవపూర్ గ్రామానికి చెందిన యమున పశువులను మేపేందుకై అబ్దుల్లాపూర్ గ్రామ శివారు ప్రాంతంలోకి వెళ్ళింది. పశువులు మేపుతున్న సమయంలో అటుగా వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకి మాయ మాటలు చెప్పి మెడలో ఉన్న రెండు తులాల గొలుసును లాక్కొని తను వచ్చిన అదే ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. జరిగిన విషయాన్ని యమునా లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిసి ఫుటేజ్ ల ఆధారంగా ముధోల్ మండలం ఆష్ట కాలనీకి చెందిన పిప్పర విజయ్ అని తెలియడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిజమే అని తెలిసింది. దీంతో శనివారం గొలుసు దొంగతనం చేసిన పిప్పర విజయ్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు అవినాష్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. జల్సాల కోసం ఇలా దొంగతనాలు అలవాటు చేసుకోవడం మంచిది కాదని ఎలాంటి తప్పిదాలు చేసిన నిఘానేత్రం తప్పకుండా గుర్తిస్తుందని అన్యాయం జరిగిన ప్రజలకు న్యాయం చేయకురేలా ఎంతటి వారైనా ఉపేక్షించకుండా పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. ప్రజలు ఇలాంటి దొంగల బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిదని తెలిపారు. మీడియా సమావేశంలో సిఐ మల్లేష్ లోకేశ్వరం ఎస్సై అశోక్ లు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.