రాజమహేంద్రవరం, సెప్టెంబరు 8 (పున్నమి ప్రతినిధి): ఒడిశాలో తెలుగు రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు చొరవ చూపిన ఎంపీ పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు నల్లమిల్లిని ఆశ్రయించగా, ఆయన పురందేశ్వరి ద్వారా ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడించి కొనుగోలుకు చర్యలు చేపట్టేలా కృషి చేశారు. దీంతో సుమారు 50 వేల మంది తెలుగు రైతులకు ఊరట లభించింది. ఈ సందర్భంగా రైతులు పురందేశ్వరి, నల్లమిల్లిని కలిసి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.



