Tuesday, 8 September 2026
  • Home  
  • విద్యార్థులపై మద్యం ఆరోపణలు.. బాలాజీనగర్‌లో కలకలం
- ఖమ్మం

విద్యార్థులపై మద్యం ఆరోపణలు.. బాలాజీనగర్‌లో కలకలం

ఖమ్మం నగరం లోని బాలాజీనగర్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు మద్యం సేవించారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు వాటర్‌ బాటిళ్లలో మద్యం తీసుకొచ్చి తాగినట్లు ప్రచారం జరగడంతో విషయం కలకలంగా మారింది. ఈ ఘటనపై సోమవారం విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవాలను నిర్ధారించకుండా ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. అధికారులు చేపట్టిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వస్తుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం నగరం లోని బాలాజీనగర్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు మద్యం సేవించారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు వాటర్‌ బాటిళ్లలో మద్యం తీసుకొచ్చి తాగినట్లు ప్రచారం జరగడంతో విషయం కలకలంగా మారింది. ఈ ఘటనపై సోమవారం విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవాలను నిర్ధారించకుండా ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. అధికారులు చేపట్టిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వస్తుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.