కూకట్పల్లి నియోజకవర్గంలోని హైదరనగర్ సర్వే నంబర్లు 145, 163లోని సాయినగర్, భగత్సింగ్ నగర్, వసంతనగర్, ఎస్ఎస్ కాలనీ, సీబీసీఐడీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇళ్లు, కాలనీలున్న ప్రాంతాలను 22A నుంచి మినహాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

22A జాబితాపై కలెక్టర్కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతి
కూకట్పల్లి నియోజకవర్గంలోని హైదరనగర్ సర్వే నంబర్లు 145, 163లోని సాయినగర్, భగత్సింగ్ నగర్, వసంతనగర్, ఎస్ఎస్ కాలనీ, సీబీసీఐడీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇళ్లు, కాలనీలున్న ప్రాంతాలను 22A నుంచి మినహాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

