*పున్నమి ప్రతినిధి కృష్ణ* )ఆగస్టు 14 తిరుపతి జిల్లా నూరు నియోజక వర్గం చిట్టమూరు మండలం నెల రోజుల నుంచి ఏకశిరి విజిట్ కాదు ఒక్కరోజు కొత్తగుంట విజిట్ చేయండి ఎన్ని అవినీతిలు బయట పడతాయో మీకు అర్థమై మీ ఎమ్మార్వో పదవి కి అర్థం ఉంటుంది అంటున్న ప్రజానీకం
రాజకీయ నాయకులకు న్యాయం చేయడం కాదు కూర్చున్న కుర్చీకి న్యాయం చేయండి ఎమ్మార్వో సారు అంటున్న మండల ప్రజలు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం*
తహసిల్దార్,రామయ్య,యాకసిరిలో వన్ మంత్ – ఫోర్ విజిట్స్ కార్యక్రమం
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా గురువారం యాకసిరి గ్రామంలో తహసీల్దార్,రామయ్య,సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు.వాటి పరిష్కారానికి చర్యలు,తీసుకుంటామని,తెలిపారు.గ్రామంలోని గిరిజన కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని గిరిజనులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.దీనిపై వెంటనే స్పందించిన తహసీల్దార్,రామయ్య సంబంధిత ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారికి నిబంధనల మేరకు నోటీసులు జారీ చేస్తామని,ఆక్రమణలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్రామయ్య,హెచ్చరించారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం,పొందాలని తహసీల్దార్ రామయ్య సూచించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు



