పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులోని కనకదుర్గ రైస్ మిల్లులో పిడిఎస్ బియ్యం అక్రమంగా నిలువ చేసినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందితో కలిసి దాడి చేసి కుప్పగా నిలువచేసిన 200 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పంచనామా నిర్వహించి తదుపరి ఆదేశాల వరకు మరో రైస్ మిల్లులో భద్రపరిచినట్లు తెలిపారు అక్రమంగా పిడిఎఫ్ బియ్యం వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ హెచ్చరించారు


