ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఈగల్ (EAGLE) టీమ్ వారు ఈరోజు కేశవ రెడ్డి పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాల్సిన అవసరం, వాటి వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక నష్టాల గురించి చక్కగా వివరించారు. అలాగే అప్రమత్తంగా ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు.
ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఈగల్ టీమ్ సభ్యులకు మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



