2020 హత్రాస్ అత్యాచార కేసుపై మళ్లీ దర్యాప్తు జరపాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో కేసు దర్యాప్తులో లోపాలు ఉన్నట్లు బయటపడిందని ఆరోపించింది. బాధితురాలి వైద్య పరీక్షలు ఆలస్యంగా జరిగాయని, కీలక ఆధారాలు సేకరించలేదని పేర్కొంది. దీనివల్ల కేసు బలహీనపడిందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా విమర్శించారు. బాధితురాలి కుటుంబ అనుమతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించారనే ఆరోపణలను కూడా ఆమె ప్రస్తావించారు. కేసులో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హత్రాస్ కేసుపై కొత్త దర్యాప్తు కోరిన మహిళా కాంగ్రెస్
2020 హత్రాస్ అత్యాచార కేసుపై మళ్లీ దర్యాప్తు జరపాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో కేసు దర్యాప్తులో లోపాలు ఉన్నట్లు బయటపడిందని ఆరోపించింది. బాధితురాలి వైద్య పరీక్షలు ఆలస్యంగా జరిగాయని, కీలక ఆధారాలు సేకరించలేదని పేర్కొంది. దీనివల్ల కేసు బలహీనపడిందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా విమర్శించారు. బాధితురాలి కుటుంబ అనుమతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించారనే ఆరోపణలను కూడా ఆమె ప్రస్తావించారు. కేసులో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

