స్కూల్ బస్సుల దుర్వినియోగంపై కఠిన చర్యలు
పున్నమి న్యూస్ ప్రతినిధి
05 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం
నియోజకవర్గ ఇన్చార్జ్ :
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల బస్సుల దుర్వినియోగంపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కఠిన ఆదేశాలు జారీ చేశారు.
– విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
*ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బస్సులను పెళ్లిళ్లు, ప్రైవేట్ కార్యక్రమాలు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇవ్వడంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు.* ఈ బస్సులు కేవలం విద్యార్థుల రవాణా మరియు అధికారిక విద్యా పర్యటనలకే ఉపయోగించాలని స్పష్టం చేశారు.
బస్సులను ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడటమే కాకుండా, బాధ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. *ఈ నిబంధనలను వెంటనే అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.*



