కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మాధవి కాలేజీలో సెప్టెంబర్ 16వ తేదీన నిర్వహించనున్న **“జాబ్ మేళా”**కు సంబంధించిన కరపత్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


