నంద్యాల: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మావతి నగర్లోని సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో మూడు రోజుల ఉచిత మెగా వైద్య శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు శిబిరాన్ని ప్రారంభించారు.డాక్టర్ నయన్ బాబా, డాక్టర్ సునీత్ ఆధ్వర్యంలో నవజాత శిశువులకు వినికిడి పరీక్షలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో శిశువుకు రూ.2,500 విలువైన పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆదివారం వరకు జరిగే శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



