నంద్యాల : నంద్యాల జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్పర్సన్గా కరుణామయ విద్యాసంస్థల కరస్పాండెంట్ దండే వెంకట్ నరేష్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.బాలల హక్కుల పరిరక్షణ, అనాథలు, వీధిబాలలు, ఆపదలో ఉన్న చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని వెంకట్ నరేష్ తెలిపారు. ఆయన నియామకంపై మంత్రి ఫరూక్ అభినందనలు తెలిపారు.



