ఎస్.కోట మండలం శివరామరాజుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎస్.కోట నియోజకవర్గ శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కు అర్చకులు, గ్రామ పెద్దలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా జరిగిన విగ్రహ ప్రతిష్టాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ:
”గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం వల్ల ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందుతాయి. లంకాధిపతిని సైతం గడగడలాడించిన లక్ష్మణ ప్రాణదాత, భక్త శిఖామణి అయిన ఆ హనుమంతుడి ఆశీస్సులు శివరామరాజుపేట గ్రామ ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఆలయ నిర్మాణానికి కారకులైన కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు నా అభినందనలు.”
గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయం భవిష్యత్తులో మరింత ప్రసిద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ కోట మండల పార్టీ అధ్యక్షుడు డోకుల అచ్చం నాయుడు, పిఎసిఎస్ చైర్మన్ గొర్రుపోటు సింహాచలం నాయుడు, ప్రధాన కార్యదర్శి కోట్యాడ జగదీష్, బీజేపీ నాయకులు లోకబి రామకోటి, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాద వితరణ .



