*వాతావరణాధారిత పంటలకు బీమా దరఖాస్తు కొరకు ఈ నెల 24 వరకే చివరి అవకాశం*- పొలం పిలుస్తుంది లో మండల వ్యవసాయాధికారి జి పి ఒబులేసు.
బుధవారం నాడు వేముల మరియు శేసన్నగరి పల్లి పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా వాతావరణాధారిత పంటలు అయినటువంటి ప్రత్తి,వేరుశెనగ, చీనీ మరియు అరటి పంటలకు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ వరకే చివరి అవకాశం కావున పంట వేసిన రైతులు సమీప మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోగలరని వేముల మండల వ్యవసాయాధికారి జి పి ఒబులేసు గారు పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా పంటలకు ఈ నెల 31 వ తేదీ మరియు వరి కి ఆగస్టు 15 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది ఉద్యానవన సహాయకులు నియాజుల్లా, ప్రకృతి సేద్య సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.



