వెల్దండ ఇంచార్జ్ ఎంపీఓగా బాధ్యతలు స్వీకరణ
వెల్దండ మండల ఇంచార్జ్ ఎంపీఓగా గిరి గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
వెల్దండ: వెల్దండ మండల ఇంచార్జ్ ఎంపీఓగా గిరి గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీఓగా పనిచేస్తున్న లక్ష్మణ్ రాథోడ్ కు ఎంపీడీవో గా పదోన్నతి వచ్చి మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా ఆయన స్థానంలో వెల్దండ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గిరి గౌడ్ అదనంగా ఎంపీఒగా ఇంచార్జ్ బాధ్యతను స్వీకరించారు.


