వెంగన్నపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, విద్య, ఐటీ & ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి మార్గదర్శకత్వంలో, ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి గారి ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో చేపట్టిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఈరోజు వెంగన్నపాలెం గ్రామంలో దుత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉండేల గురువారెడ్డి గారు ఇంటింటికీ వెళ్లి, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పూర్తయిన అభివృద్ధి పనులు, రాబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లంపాటి గురవయ్య నాయుడు గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు కాకు నాగేశ్వరరావు గారు, క్లస్టర్ ఇన్చార్జ్ దయానందం గారు, కుటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



