భూపాలపల్లి, ఆగస్టు 16, 2026:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న పుష్ప గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ప్రీతి – రూపేశ్వర చారి వివాహ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు ప్రీతి, రూపేశ్వర చారిలను కలిసి అభినందించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించారు.
వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి ఎస్పీకే సాగర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎస్పీకే సాగర్ మాట్లాడుతూ, వివాహ బంధం ఎంతో పవిత్రమైనదని, నూతన దంపతులు పరస్పర అవగాహన, ప్రేమానురాగాలతో జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.


