నంద్యాల: వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా ప్రాంతాల్లోని నిమజ్జన ఘాట్లు, ఊరేగింపు మార్గాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు.ఘాట్ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రక్రియలో ప్రజలు పోలీసులకు సహకరించి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామంజి నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: నంద్యాల జిల్లా ఎస్పీ
నంద్యాల: వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా ప్రాంతాల్లోని నిమజ్జన ఘాట్లు, ఊరేగింపు మార్గాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు.ఘాట్ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రక్రియలో ప్రజలు పోలీసులకు సహకరించి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామంజి నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

