భద్రాద్రి కొత్తగూడెం:- 10/09/2026 పున్నమి ప్రతినిధి
అజ్మీర సురేష్ నాయక్ వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద NSUI నాయకులు, కార్యకర్తలు బాణాసంచాకాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఘనంగా సంబరాలు చేసుకున్నారు.
సురేష్ నాయక్ గారు మళ్లీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంపై వారు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో విద్యార్థి ఉద్యమాలు మరిన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వేడుకల్లో NSUI నాయకులు సందీప్, శివ, శ్రీధర్, సాయి, సమీర్, శ్రీకాంత్, షాను, నవీన్, సంతోష్, విక్రమ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


