పున్నమి ప్రతి నిధి
దేశవ్యాప్తంగా వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (సూపరింటెండెంట్) గారిని బీజేపీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు పోతుల చంద్రశేఖర్ ,పొట్టి మూర్తి జనార్ధన్, బోయినపల్లి సురేష్, ఖమ్మం 2వ పట్టణ ప్రధాన కార్యదర్శి మాధవ్ రుద్రగాని పాల్గొన్నారు.


