పెడపర్తి, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ఉపయోగపడనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్లినిక్ భవనాన్ని పరిశీలించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


