విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 19::::ఈ నెల 13న అనకాపల్లిలో రాష్ట్రస్థాయి గ్రాఫిక్ పోటీలు జరిగాయి తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి గ్రాప్లింగ్ పోటీల్లో ఆనందపురం మండలం గిడిజాల గ్రామంలో గల సావన్ మిత్రా స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. ఒలింపియన్ మళ్ళ మాణిక్యాలు ఆధ్వర్యంలో ఈ నెల 13న వీ.వీ. రమణ రైతు భారతి వేదికగా జరిగిన పోటీల్లో విద్యార్థులు వివిధ కేటగిరీల్లో ప్రతిభ చాటారు.
🥇🥈🥉 పతకాలతో మెరిసిన విద్యార్థులు
బాలికల విభాగం:
• యువతేజస్విని – 🥈 రజత పతకం
• చైత్ర లహరి – 🥇 స్వర్ణ పతకం
• భాగ్యశ్రీ – 🥈 రజత పతకం
• లాలిత్య – 🥇 స్వర్ణ పతకం
• దివ్యశ్రీ – 🥈 రజత పతకం
• కుష్మిత – 🥉 కాంస్య పతకం
బాలుర విభాగం:
• మోహిత్య – 🥈🥈 రెండు రజత పతకాలు
• ఎం. యశ్వంత్ – 🥇 స్వర్ణ పతకం
• ఎం. హర్ష – 🥈🥉 రజత, కాంస్య పతకాలు
• సాయిధనుష్ – 🥇🥉 స్వర్ణ, కాంస్య పతకాలు
• శ్రీచరణ్ – 🥇🥈 స్వర్ణ, రజత పతకాలు
• పి. హర్షవర్ధన్ – 🥈🥈 రెండు రజత పతకాలు
• కె. హర్షవర్ధన్ – 🥇🥇 రెండు స్వర్ణ పతకాలు
• ఎ. కార్తికేయ – 🥇🥉 స్వర్ణ, కాంస్య పతకాలు
విద్యార్థుల ప్రతిభపై సావన్ మిత్రా స్కూల్ చైర్మన్ రొంగళి వెంకటేశ్వరరావు (వెంకట్) గారు, ప్రిన్సిపాల్ ఆర్ఎస్ఎస్ కృష్ణంరాజు గారు, కరస్పాండెంట్ ఆర్. పద్మ గారు, డైరెక్టర్ ఆర్. సత్యవేణి గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు.
విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి పాఠశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. విద్యార్థుల విజయాలు మరింత మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు.

