అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 22 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ): రాంబిల్లి మండలంలో ‘రెన్యూ’ సంస్థ ఏర్పాటు చేస్తున్న భారీ ప్రాజెక్టుకు ఈ నెల 23న భూమిపూజ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు సమాచారం. జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రాక నేపథ్యంలో జిల్లా అధికారులు, పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీగా ప్రజలు, నాయకులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

రాంబిల్లిలో ‘రెన్యూ’ ప్రాజెక్టుకు 23న భూమిపూజ – సీఎం రాకకు విస్తృత ఏర్పాట్లు….
అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 22 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ): రాంబిల్లి మండలంలో ‘రెన్యూ’ సంస్థ ఏర్పాటు చేస్తున్న భారీ ప్రాజెక్టుకు ఈ నెల 23న భూమిపూజ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు సమాచారం. జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రాక నేపథ్యంలో జిల్లా అధికారులు, పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీగా ప్రజలు, నాయకులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

