రహదారికి మోక్షం కల్పించండి మహా ప్రభో…
పున్నమి ప్రతినిధి పి. గన్నవరం…
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ముంగండ ఇసుకపూడి రహదారి గత ప్రభుత్వం పాలకుల వైఫల్యం వల్ల ఏ విధమైన అభివృద్ధి కి నోచుకోలేదు. 2003 వ సంవత్సరం లో అప్పటి శాసనసభ్యుడు మానేపల్లి అయ్యాజీ వేమ హయాంలో నిర్మాణం జరిగింది. అప్పటి నుండి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వర్షాకాల సమయంలో ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ఈ రహదారి పై ప్రయాణం సాగించాలంటే నరకం చూస్తున్న వాహన చోదకులు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామీణ రహదారులు అభివృద్ధి పై ద్రుష్టి సారించిన జనసేన అధినేత డి ప్యూటీ సి యం పవన్ కళ్యాణ్ గారు.. ఇరు గ్రామాల ప్రజలు స్థానిక నియోజకవర్గ శాసన సభ్యుడు గిడ్డి సత్యనారాయణ దృష్టి కి తీసుకోని వెళ్లగా రహదారి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్లి త్వరలో నే రోడ్డు నిర్మాణం చెప్పడతామని హామీ ఇచ్చారు..


