*❇️17న మెగా పీటీఎం*
*» రంపచోడవరంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్*
అమరావతి, జూలై 6: ఈ నెల 17న అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయిం చింది. రంపచోడవరంలో జరిగే మెగా పీటీఎంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొంటారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు అన్ని పాఠశాలల్లో ఈ సమావేశాలు జరుగు తాయి. విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తారు.


