*మొండిగౌరెల్లి గ్రామంలో భూసేకరణ పేరుతో చేతులు మారుతున్న కోట్ల రూపాయలు*
పున్నమి న్యూస్ ప్రతినిధి
26 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
-సర్వే నెంబర్ 19 పేరుతో యాచారం రెవెన్యూలో అధికారులు ఫోటో తీస్తున్నారని సమాచారం
-సాగుకు అనుకూలంగా ఉన్న భూములకే కబ్జా రేట్ కట్టించాలి
-గుట్టలు,బండలు కబ్జా పేరుతో కోట్ల దందా
-సాగు చేసే కబ్జా భూములకు మాత్రమే నష్టపరిహారం ఇవ్వాలి లేని యెడల మరోసారి గ్రామంలో దీక్ష చేయడానికి సిద్ధం
-గ్రామంలో రాజకీయ నాయకుల అత్యుత్సాహ ప్రదర్శన
-రైతు భూమి సర్వే పూర్తి కాగానే రైతుకు ఎంత భూమి ఉంది రికార్డు కబ్జా ఎంత ఉంది ఈ వివరాలు రైతుకు చెప్పకపోవడం వెనక ఉన్న రహస్యం ఏంటి
-తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్
రంగారెడ్డి జిల్లా,యాచారం మండలం,మొండి గౌరెల్లి గ్రామంలో పారిశ్రామిక పార్క్ పేరు తో ప్రభుత్వ భూములు సర్వే నెంబర్లు 19,68,127 లలో మొత్తం విస్తీర్ణం 677-29 ఎకరాలు ప్రభుత్వ భూమి సేకరణకు గత సంవత్సరంలో నోటిఫికేషన్ ప్రకటించింది.కొంతమంది భూకబ్జాదారులు ప్రభుత్వ అధికారులతో చేతులు కలిపి విచ్చలవిడిగా దారుణలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్ ఆరోపించారు.గ్రామంలో ఉన్న సోమన్న గుడి దగ్గర ఉన్న గుండం మినహాయించి మిగితా గుట్టలు,బండలు మొత్తం అధికారులకు కబ్జా చూపించి ఫోటో దిగిన లీడర్ ఇలాంటి అక్రమాలు జరుగుతున్న రెవిన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం దేనికి సంకేతం రాజకీయ పలుకుబడి తో గుట్టలను కూడా వదలని కొంతమంది లీడర్ లు గతంలో గుట్టలకు రైతుబంధు తీసుకొని లక్షలు సంపాదన ఇప్పుడు భూసేకరణ పేరుతో కోట్ల దందా భూసేకరణ పేరుతో ఒక్కప్రక్క రైతులకు నష్టం జరుగుతుంటే మరో ప్రక్కన లీడర్లకు కోట్ల దందా నడుస్తుందని ఇందులో ఎవరి వాటా ఎంత భూమి కబ్జా పేరుతో విచ్చలవిడిగా నాయకులు అధికారులు మధ్య భారీగా ముడుపులు అందుతున్నాయి.గుట్టలను బండలను కబ్జా పేరుతో వదలకుండా అక్రమంగా ప్రభుత్వ ఆస్థిని కొల్లాగోడుతున్నారు.ప్రభుత్వ అధికారులే రక్షించకపోతే ఎలా దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవచూపి సాగుకు అనుకూలంగా ఉన్న కబ్జా భూములకే నష్టపరిహారం అందించాలని లేని యెడల యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.


