Friday, 14 August 2026
  • Home  
  • మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి-ఏఐటీయూసీ డిమాండ్
- తిరుపతి

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి-ఏఐటీయూసీ డిమాండ్

శ్రీ కాళహస్తి, ఆగస్టు 13, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ మున్సిపాలిటీలో రేయింబగళ్లు శ్రమిస్తున్న రోజువారీ పారిశుద్ధ్య కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే బకాయి జీతాలను విడుదల చేయాలని ఏఐటీయూసీ (AITUC) ప్రధాన కార్యదర్శి కేతారి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికుల పలు సమస్యలపై ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న కార్మికులను గుర్తించి వారికి అవసరమైన పనిముట్లు, చేతి తొడుగులు (గ్లౌజెస్), మాస్కులు, బూట్లు సకాలంలో సరఫరా చేయాలని, అలాగే ప్రతి కార్మికుడికి పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI) సౌకర్యాలు కల్పించాలని కోరారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం రోజురోజుకూ విస్తరిస్తోందని, దానికి తగినట్లుగా సరిపడా కార్మికులు లేకపోవడంతో ప్రస్తుత సిబ్బందిపై పని భారం విపరీతంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అదనపు కార్మికులను నియమించి, రోజువారీ కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని మున్సిపల్ అధికారులను కోరారు. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించని పక్షంలో, ఈ నెల 18వ తేదీన తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (CPI) నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, ఏఐటీయూసీ జిల్లా సబ్ కమిటీ సభ్యుడు కత్తి రవి, నియోజకవర్గ కార్యదర్శి తొండు మల్లిఖార్జున్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షురాలు చారులత, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోగిలి హరి, జాన్, కొండమ్మ, మురళి తదితరులు పాల్గొని మున్సిపల్ కార్మికులకు మద్దతు ప్రకటించారు.

శ్రీ కాళహస్తి, ఆగస్టు 13, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ మున్సిపాలిటీలో రేయింబగళ్లు శ్రమిస్తున్న రోజువారీ పారిశుద్ధ్య కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే బకాయి జీతాలను విడుదల చేయాలని ఏఐటీయూసీ (AITUC) ప్రధాన కార్యదర్శి కేతారి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికుల పలు సమస్యలపై ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న కార్మికులను గుర్తించి వారికి అవసరమైన పనిముట్లు, చేతి తొడుగులు (గ్లౌజెస్), మాస్కులు, బూట్లు సకాలంలో సరఫరా చేయాలని, అలాగే ప్రతి కార్మికుడికి పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI) సౌకర్యాలు కల్పించాలని కోరారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం రోజురోజుకూ విస్తరిస్తోందని, దానికి తగినట్లుగా సరిపడా కార్మికులు లేకపోవడంతో ప్రస్తుత సిబ్బందిపై పని భారం విపరీతంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అదనపు కార్మికులను నియమించి, రోజువారీ కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని మున్సిపల్ అధికారులను కోరారు. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించని పక్షంలో, ఈ నెల 18వ తేదీన తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (CPI) నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, ఏఐటీయూసీ జిల్లా సబ్ కమిటీ సభ్యుడు కత్తి రవి, నియోజకవర్గ కార్యదర్శి తొండు మల్లిఖార్జున్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షురాలు చారులత, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోగిలి హరి, జాన్, కొండమ్మ, మురళి తదితరులు పాల్గొని మున్సిపల్ కార్మికులకు మద్దతు ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.