ముధోల్, ఆగస్టు 9(పున్నమి ప్రతినిధి ): ముధోల్ మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జోందలే విశ్వంబర్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట శ్యాంసుందర్ ఆధ్వర్యంలో శనివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం పార్టీలో చేసిన సేవలను గుర్తించు ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా జోన్దలే విశ్వంబర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.



