అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని అనపర్తి మండలం రామవరంలో శ్రీ సాయితేజా విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో 2,000 మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మట్టి గణపతి విగ్రహాన్ని అందజేశారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని అనపర్తి మండలం రామవరంలో శ్రీ సాయితేజా విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో 2,000 మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మట్టి గణపతి విగ్రహాన్ని అందజేశారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

