కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం పుణ్యక్షేత్ర ప్రాంతం కాబట్టి వివిధ ప్రాంతాల నుండి అనేకమంది భక్తాదులు వస్తూ ఉంటారు అటువంటి ప్రాంతంలో గుడికి కేవలం 100 అడుగుల దూరంలోనే బెల్టు షాపులు నిర్వహించడం చాలా బాధాకరమైన విషయం
చీకట్లో నాలుగు గంటల నుండే బ్రహ్మంగారిమఠం మండలంలో బెల్ట్ షాపులు తెరిచి ఉంటారు.నెలసరి మామూలు ఇస్తున్నాం మా బెల్ట్ షాపులు టచ్ చేసేవారు ఎవరు?* అంటూ విర్ర వీగిపోతున్న బెల్ట్ షాప్ యాజమాన్యం
కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులను అరికడతామన్నారు ఇదేనా బెల్ట్ షాపులు అరికట్టే తీరు. మహిళల ఆత్మ గౌరవం కాపాడేది ఈ విధంగానేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.


