ఎలమంచిలి , జూన్ 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మండల బూత్ కోఆర్డినేషన్ సమావేశం ఆదివారం రాత్రి రేగిపాలెంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో కొల్లి సత్యనారాయణ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి శ్రీమతి పిల్ల రమాకుమార్, బి.వి.ఎస్. వర్మ, కొరుప్రోలు చిన్నారావు, ఆడారి చిన్న, బొడ్డేడ నాగేశ్వరరావు, నక్క శివశంకర్, కొల్లి సత్యనారాయణతో పాటు మండల కార్యవర్గ సభ్యులు, 26 మంది బూత్ అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, బూత్ స్థాయిలో కార్యకర్తల సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

బూత్ల బలోపేతంతో బీజేపీ విజయపథం.. రేగిపాలెంలో ఉత్సాహంగా మండల సమన్వయ సమావేశం..!
ఎలమంచిలి , జూన్ 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మండల బూత్ కోఆర్డినేషన్ సమావేశం ఆదివారం రాత్రి రేగిపాలెంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో కొల్లి సత్యనారాయణ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి శ్రీమతి పిల్ల రమాకుమార్, బి.వి.ఎస్. వర్మ, కొరుప్రోలు చిన్నారావు, ఆడారి చిన్న, బొడ్డేడ నాగేశ్వరరావు, నక్క శివశంకర్, కొల్లి సత్యనారాయణతో పాటు మండల కార్యవర్గ సభ్యులు, 26 మంది బూత్ అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, బూత్ స్థాయిలో కార్యకర్తల సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

