సత్తుపల్లి:/ఖమ్మం
సత్తుపల్లి మండల, పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని సండ్ర వెంకట వీరయ్య సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ కార్యకర్తలకు అండగా నిలవాలని నాయకులకు సూచించారు. సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



