నెల్లూరులోని జనహిత వాత్సల్య సొసైటీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలబాలికలకు జీవనం, విద్య, అభివృద్ధి, రక్షణ, భాగస్వామ్య హక్కులు ఉన్నాయని తెలిపారు. బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర బాలల సహాయానికి 1098, ఉచిత న్యాయ సహాయానికి 15100 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. అనంతరం హాస్టల్ వసతులు, భోజన ఏర్పాట్లను పరిశీలించారు.

బాలల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు
నెల్లూరులోని జనహిత వాత్సల్య సొసైటీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలబాలికలకు జీవనం, విద్య, అభివృద్ధి, రక్షణ, భాగస్వామ్య హక్కులు ఉన్నాయని తెలిపారు. బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర బాలల సహాయానికి 1098, ఉచిత న్యాయ సహాయానికి 15100 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. అనంతరం హాస్టల్ వసతులు, భోజన ఏర్పాట్లను పరిశీలించారు.

