దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలపై గతంలో విధించిన అన్ని పరిమితులను కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా విధించిన పరిమితులు ప్రస్తుతం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిటైల్ పంపుల వద్ద డీజిల్ విక్రయాల పరిమితిని పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పారిశ్రామిక వినియోగదారులు కూడా మళ్లీ సాధారణ పెట్రోల్ బంకుల నుంచే ఇంధనం కొనుగోలు చేసేందుకు అనుమతి కల్పించింది. దేశంలో ఇంధన సరఫరా పరిస్థితి స్థిరపడిందని, బ్లాక్ మార్కెటింగ్, నిల్వల సమస్యలు తగ్గాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ సరఫరా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం విధించిన ఆంక్షల ఎత్తివేత
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలపై గతంలో విధించిన అన్ని పరిమితులను కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా విధించిన పరిమితులు ప్రస్తుతం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిటైల్ పంపుల వద్ద డీజిల్ విక్రయాల పరిమితిని పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పారిశ్రామిక వినియోగదారులు కూడా మళ్లీ సాధారణ పెట్రోల్ బంకుల నుంచే ఇంధనం కొనుగోలు చేసేందుకు అనుమతి కల్పించింది. దేశంలో ఇంధన సరఫరా పరిస్థితి స్థిరపడిందని, బ్లాక్ మార్కెటింగ్, నిల్వల సమస్యలు తగ్గాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ సరఫరా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

