మేడ్చల్:
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉన్నతాశయంతో గత ప్రభుత్వం మేడ్చల్ జిల్లాలోని 20 ప్రధాన ప్రాంతాలలో సుమారు 318 భవన సముదాయాలను నిర్మించింది. దాదాపు 29,302 నిరుపేద కుటుంబాలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించగా, వారు అక్కడ నివాసముంటున్నారు. అయితే, పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాల్సిన ఈ ఇళ్లు ప్రస్తుతం కొంతమంది స్వార్థపరులైన దళారులకు కామధేనువుగా మారాయి.
అర్హులైన పేదలకు చెందిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొందరు దళారులు అక్రమంగా క్రమవిక్రయాలు చేస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, అక్రమ అమ్మకాలపై మేడ్చల్ జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యతారాహిత్యంగా అధికారుల వ్యాఖ్యలు!
ఈ అక్రమాలపై ఏప్రిల్ 30వ తేదీన స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆధారాలతో సహా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇచ్చి ఇన్ని రోజులైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారి నిమ్మకు నీరెత్తిన వైఖరిని, ఉదాసీనతను స్పష్టంగా తెలియజేస్తోంది.
ఫిర్యాదుపై స్పందన ఏంటని మేడ్చల్ హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) గారిని వివరణ కోరగా.. “మేము ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేము” అని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారే ఇలా చేతులెత్తేయడంతో దళారుల వెనుక అధికారుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి!
పేదల హక్కులను కాలరాస్తూ ఇళ్లను విక్రయిస్తున్న దళారులపై మరియు ఫిర్యాదులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రాజెక్ట్ డైరెక్టర్పై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక స్పృహ ఉన్న పౌరులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని అక్రమంగా అమ్ముడుపోయిన ఇళ్లను స్వాధీనం చేసుకొని, నిజమైన అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

పేదల ఇళ్లకు ‘దళారుల’ కన్నం.. పట్టించుకోని అధికారులు!
మేడ్చల్: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉన్నతాశయంతో గత ప్రభుత్వం మేడ్చల్ జిల్లాలోని 20 ప్రధాన ప్రాంతాలలో సుమారు 318 భవన సముదాయాలను నిర్మించింది. దాదాపు 29,302 నిరుపేద కుటుంబాలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించగా, వారు అక్కడ నివాసముంటున్నారు. అయితే, పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాల్సిన ఈ ఇళ్లు ప్రస్తుతం కొంతమంది స్వార్థపరులైన దళారులకు కామధేనువుగా మారాయి. అర్హులైన పేదలకు చెందిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొందరు దళారులు అక్రమంగా క్రమవిక్రయాలు చేస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, అక్రమ అమ్మకాలపై మేడ్చల్ జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా అధికారుల వ్యాఖ్యలు! ఈ అక్రమాలపై ఏప్రిల్ 30వ తేదీన స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆధారాలతో సహా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇచ్చి ఇన్ని రోజులైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారి నిమ్మకు నీరెత్తిన వైఖరిని, ఉదాసీనతను స్పష్టంగా తెలియజేస్తోంది. ఫిర్యాదుపై స్పందన ఏంటని మేడ్చల్ హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) గారిని వివరణ కోరగా.. “మేము ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేము” అని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారే ఇలా చేతులెత్తేయడంతో దళారుల వెనుక అధికారుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి! పేదల హక్కులను కాలరాస్తూ ఇళ్లను విక్రయిస్తున్న దళారులపై మరియు ఫిర్యాదులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రాజెక్ట్ డైరెక్టర్పై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక స్పృహ ఉన్న పౌరులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని అక్రమంగా అమ్ముడుపోయిన ఇళ్లను స్వాధీనం చేసుకొని, నిజమైన అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

