ముస్తాబాద్ మే 15 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం సరైంది కాదన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

