నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. 2026-27 తొలి అర్థ సంవత్సరం ముగింపుకు 36 రోజులే మిగిలి ఉన్నందున నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. కొత్త భవనాలు, ఖాళీ స్థలాలు, అదనపు అంతస్తులను గుర్తించి పన్ను పరిధిలోకి తేవాలని సూచించారు. లోక్ అదాలత్ నోటీసుల అనంతరం కూడా బకాయిలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని, పౌర సేవల దరఖాస్తులను గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు ప్రతిరోజూ బకాయి వసూళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టీపీఆర్ఓ వాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

పన్ను వసూళ్ల లక్ష్యాల సాధనపై కమిషనర్ సమీక్ష
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. 2026-27 తొలి అర్థ సంవత్సరం ముగింపుకు 36 రోజులే మిగిలి ఉన్నందున నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. కొత్త భవనాలు, ఖాళీ స్థలాలు, అదనపు అంతస్తులను గుర్తించి పన్ను పరిధిలోకి తేవాలని సూచించారు. లోక్ అదాలత్ నోటీసుల అనంతరం కూడా బకాయిలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని, పౌర సేవల దరఖాస్తులను గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు ప్రతిరోజూ బకాయి వసూళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టీపీఆర్ఓ వాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

