పట్టపగలే వీధి లైట్లు వెలుగు తున్న నిర్లక్ష్యంలో విధ్యుత్ అధికారులు.
తూర్పు గోదావరిజిల్లా సెప్టెంబర్ 8
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల , దేవరపల్లి మండలం సంగాయగూడెం గ్రామం లో పట్టపగలే వీధి లైట్లు వెలుగుతున్న వాటిని పట్టించుకొనే అధికారి కరువైనాడు అధికారుల్ నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు ఎలా పాటిస్తారు అని ఆలోచనచేయాలి ఎల్ నీనో ప్రభావం వల్ల కరంటు అధికంగా వాడుతున్నారు కనుక అనవసరంగా వాడకండి అని అవసరం ఐతేనే వాడాలి అని విధ్యుత్ అధికార్లు చెప్పడం ఆశ్చర్యం గా ఉందని ప్రజలు ఆలోచన లో పడ్డారు ప్రజలు వాడే కరంట్ కంటే అధికార్లే వృధాగా ఖర్చు చేస్తున్నారని ప్రజలు అధికారులు పై మండి పడుతున్నారు అస్సలు అధికార్లు ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే నిద్రపోతున్నారా అనే ప్రశ్న ప్రజల్లో కలుగుతుంది . అధికారులు నిర్లక్ష్యం వల్లే మన రాష్ట్రo దిగజారిన పరిస్థితి నెలకొన్నది అని ప్రజలు మండి పడుతున్నారు వీళ్లు జీతాలు తెసుకోవటమే కానీ వారి బాధ్యత నెరవేర్చలేకపోతున్నారు అని గ్రామ ప్రజలు మండి పడుతున్నారు ఇకనైనా అధికార్లు స్పందించి మాకు సక్రమంగా పనిచేసే అధికారులుని ఇవ్వమని వేడుకుంటున్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


