ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ ప్రతి నిధి)
నాడు ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో , అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ అమలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ఆందోళన సందర్భంగా నమోదైన అక్రమ కేసుల విచారణలో భాగంగా BJYM నాయకులు ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు. హాజరైన వారిలో మాజీ BJYM జిల్లా అధ్యక్షుడు అనంత్ ఉపేందర్, వల్లాల రమేష్ యాదవ్, ఎలిశెట్టి మణికంఠ, బోయినపల్లి ప్రభాకర్, చాగంటి మణికంఠ తదితరులు ఉన్నారు.



