కమిషనర్ ఎం.జయకృష్ణ
తిరుపతి సెప్టెంబర్ 7 పున్నమి ప్రతినిధి
నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 32 వినతులు వచ్చాయని కమిషనర్ ఎం.జయకృష్ణ తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 12 మంది, కార్యాలయంకు నేరుగా వచ్చి 26 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు. శివజ్యోతి నగర్ లో రోడ్డులో యూడీఎస్ కాలువలు, సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని, టిడిఆర్ బాండ్లు ఇప్పించాలని, ఎమ్మార్ పల్లి టీటిడి ప్లాట్స్ లో తెలుగుగంగ నీరు సక్రమంగా రావడం లేదని, ప్రకాశం పార్కు నందు వాకింగ్ ట్రాక్ మరమ్మతులు చేయించాలని, శ్రీనివాసపురంలో ఉన్న వేస్ట్ షాప్ వలన ఇబ్బందిగా ఉంది పరిష్కరించాలని, మంచాల వీధిలో తెలుగుగంగ లైన్ కొరకు తవ్విన కాలువలు పూడ్చాలని, ఎన్.జి.ఓ. కాలనీలో రోడ్లపై పార్కింగ్ ఎక్కువయ్యింద ని, కపిలతీర్థం కాలువలో పిచ్చి మొక్కలు ఎక్కువ కావడం వలన దోమలు ఎక్కువగా ఉన్నాయి పరిష్కరించాలని, పాత మునిసిపల్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయలేదు పరిష్కటించాలని, ప్రజల నుండి వచ్చిన సమస్యలను ఆయా విభాగాల అధికారులకు పంపి చర్యలు చేపడతామని కమిషనర్ తెలుపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవిన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, ఏసీపీ లు పార్వతి ప్రియ, మూర్తి, మేనేజర్ హసీమ్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి మరియు సిబ్బంది పాల్గొన్నారు.


