దుత్తలూరు, జూలై 25 (పున్నమి ప్రతినిధి)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ బీసీ కాలనీలో శనివారం భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి నగదు, విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరిస్తూ ఆధారాలను పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. వరుస చోరీల ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.


