రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి)డిసెంబర్ 24:
తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షురాలుగా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల గ్రామానికి చెందిన గొల్లు వరలక్ష్మి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రౌతులపూడి మండల అధ్యక్షులు తమరాల సత్యనారాయణ, రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి, రాష్ట్ర బీసీ సెల్ డైరెక్టర్ పైల సాంబశివరావు, మాజీ ఎంపీపీ ఇటం శెట్టి భాస్కర్ బాబు, ఎస్ పైడిపాల మాజీ సర్పంచ్ ఈగల సత్తిబాబు పలువురు నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గొల్లు వరలక్ష్మి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వరలక్ష్మి అన్నారు.


