భద్రాద్రి కొత్తగూడెం. జులై.31.(పున్నమి. న్యూస్ )
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల ఓట్లను ‘అనకలెక్టబుల్’ కేటగిరీలో చేర్చి తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారనే వార్తలపై రాజకీయ పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 13 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య రెండు వారాల్లోనే 40 లక్షలకు చేరడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఓట్లు తొలగింపు జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. BLAల నిర్ధారణ లేకుండానే ఓట్ల తొలగింపు జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, అర్హులైన ఓటర్ల హక్కులు కోల్పోకుండా ప్రక్రియను పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తున్నాయి


