జిల్లా స్థాయి బాలల సాహిత్య పోటీల్లో నామాపూర్ విద్యార్థుల ప్రతిభ
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి)
నామాపూర్: రంగినేని చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల సాహిత్య పోటీల్లో నామాపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కథల పోటీలో 9వ తరగతికి చెందిన హిమాశ్రీ, అశ్విత, సాయి మనస్విని బహుమతులు సాధించారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు పుస్తకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
అదేవిధంగా పోటీల్లో పాల్గొన్న అక్షర, తేజశ్రీలకు ప్రశంసా పత్రాలు అందించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ పాఠశాల ఉపాధ్యాయ బృందం వారిని అభినందించింది. విద్యార్థుల్లో సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

