ఖమ్మం, జూలై
(పున్నమి ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పసల్ బీమా యోజన (ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన) పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరుకుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతింటున్న రైతులకు పసల్ బీమా యోజన ఎంతో భరోసానిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా కిరణ్, ఎల్లారావు గౌడ్, కారేపల్లి మండల అధ్యక్షుడు మల్లేష్, బీజేపీ సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, మండేపూడి వీర నాగేశ్వరరావు, రామారావు, భిక్షు నాయక్ తదితరులు పాల్గొన్నారు.



