రాష్ట్రంలోని చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. భూగర్భ జలాల పెంపు, సాగునీటి అవసరాల కోసం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయనున్నారు.
స్థానిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో చెరువుల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీని వల్ల వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు.


