తాడూరు మండల పరిధిలోని బలణ్ పల్లిలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. డప్పు నృత్యాలు, వేడుకల నడుమ అమ్మవారి రథోత్సవం, ఊరేగింపు కనులపండువగా సాగాయి. గ్రామ పురవీధుల్లో మహిళలు బోనాలతో తరలివచ్చి నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు ఆలయానికి తరలిరావడంతో గ్రామంలో కోలాహలం నెలకొంది.
Uploaded Video:

